తోటి బాలిక ఆత్మహత్య చేసుకుందని....

by Sridhar Babu |
తోటి బాలిక ఆత్మహత్య చేసుకుందని....
X

దిశ, ఆమనగల్లు : హైదరాబాద్​లోని దిల్ సుఖ్ నగర్ ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిని తలుచుకుంటూ మరో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన విచారం మిగిల్చింది. మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాడుగుల గ్రామానికి చెందిన చిక్కుడు రాములుకు ముగ్గురు కూతుర్లు కలరు. అతని రెండవ కూతురు మౌనిక (19) గత రెండు సంవత్సరాల నుండి హైదరాబాద్​లోని నాంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతూ దిల్ సుఖ్ నగర్ ఎస్సీ హాస్టల్లో నివసిస్తుంది.

అదే హాస్టల్లో ఉంటున్న మరో అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, భయంగా ఉందని మౌనిక తన తండ్రికి ఫోన్ చేసింది. ఇంటికి వస్తున్నానని తండ్రికి తెలుపగా రమ్మని చెప్పాడు. మౌనిక ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భయంతో పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న తండ్రి వెంటనే మౌనికను మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకువెళ్లగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మౌనిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Next Story