- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
లారీని ఢీకొన్న కారు… మహిళ మృతి
దిశ, శంషాబాద్ : ఆగి ఉన్న లారీని వెనకాల నుంచి కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు హమితుల్లా నగర్ వద్ద చోటు చేసుకుంది. శంషాబాద్ సీఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన మాలతి ఆమె కుమార్తె మౌనిక ఇద్దరూ కూకట్పల్లి వచ్చి శుక్రవారం ఉదయం అక్కడి నుంచి బ్లూ డ్రైవ్ ఇండియాలో కారును బుక్ చేసుకుని ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా పెద్ద అంబర్పేట్లోని ఒక అనాథాశ్రమాన్ని సందర్శించారు.
అక్కడి నుంచి తిరిగి గచ్చిబౌలి వెళ్లేందుకు పెద్ద అంబర్పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి వెళుతుండగా శంషాబాద్ మండలం హమిదుల్లా నగర్ పరిధిలోనికి రాగానే ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్నలారీని కారు అతి వేగంగా ఢీకొనడంతో కారులో ఉన్న మాలతి(50) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా. ఆమె కూతురు మౌనికకు కారు డ్రైవర్ నరసింహారెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో 108 సహకారంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మాలతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.