ఏపీలో దారుణం.. నడిరోడ్డుపై వికలాంగుడిని నరికి చంపిన దుండగులు

by Satheesh |
ఏపీలో దారుణం.. నడిరోడ్డుపై వికలాంగుడిని నరికి చంపిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. విశాఖ జిల్లాలోని గాజువాక జగ్గు జంక్షన్ దగ్గర నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని నరికి చంపారు. మృతుడి గొంతు, రెండు చేతులను నరికి కిరాతకంగా హతమార్చారు. ఈ దారుణ హత్యతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని వికలాంగుడైన అప్పలనాయుడిగా గుర్తించిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనిమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు భూ తగాదాలే కారణమని అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed