తెలంగాణలో కొత్తగా 565 కరోనా కేసులు

by vinod kumar |
తెలంగాణలో కొత్తగా 565 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,833కు చేరింది. మరణాల సంఖ్య 1,462కి పెరింగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,266 యాక్టివ్ కేసులుండగా.. వైరస్ నుంచి కోలుకుని 2,60,155 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా, కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 106, రంగారెడ్డి జిల్లాలో 43 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed