ఏపీ నుంచి 49 మంది ఉద్యోగులు రిలీవ్​

by Shyam |
ఏపీ నుంచి 49 మంది ఉద్యోగులు రిలీవ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను విడుతల వారీగా తెలంగాణకు బదిలీ చేస్తున్నారు. గురువారం తెలంగాణ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్​ చేసింది. ఇటీవల ఏపీలో పని చేస్తున్న 700 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపించేందుకు ఏపీ సీఎం జగన్​ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీనిలో భాగంగా సచివాలయంలో పని చేస్తున్న 49 మంది ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్​ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద ఉద్యోగులను రిలీవ్​ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed