తెలంగాణలో 42 కరోనా కేసులు

by vinod kumar |
తెలంగాణలో 42 కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కొత్తగా 42 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 34, ఎనిమిది మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ధృవీకరించింది. అంతేకాకుండా, ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 38కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 1,634 మందికి కరోనా సోకగా.. అందులో 1.011 మంది కోలుకున్నారు. ఈ రోజు 9 మంది డిశ్చార్జి కాగా,.. ప్రస్తుతం కరోనాతో 585 మంది చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Next Story