ఆ తేదీ నాటికి భారత్‌లో థర్డ్ వేవ్.. భారీగా కేసులు నమోదు!

by Anukaran |
ఆ తేదీ నాటికి భారత్‌లో థర్డ్ వేవ్.. భారీగా కేసులు నమోదు!
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఐఐటీ కాన్పుర్‌కు చెందిన పరిశోధకులు సంచలన విషయాలు వెల్లడించారు. కరోనా డేల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో సెకండ్ వేవ్ విజృంభణతో భారీగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాప్తిలో డేల్టా వేరియంట్ కంటే మూడు నుంచి ఆరు రెట్లు అత్యధికంగా ఒమిక్రాన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో తక్కువ సమయంలోనే కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెకండ్ వేవ్‌లో కేసుల పెరుగుదలను పరిగణలోకి తీసుకుని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీ వరకు కేసుల నమోదు భారీగా పెరిగి థర్డ్ వేవ్ వస్తుందని వారి పరిశోధనలో వెల్లడైనట్లు ఐఐటీ కాన్పుర్ పరిశోధకులు చెబుతున్నారు. అయితే, రోజుకు ఎన్ని కేసులు నమోదవుతాయని చెప్పలేమని వారు వెల్లడించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story