తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు

by Anukaran |
తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,87,502కి చేరింది. ఇందులో 2,80,505 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,388 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా వైరస్ బారినపడి ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1549కు పెరిగింది. ఈ మేరకు ఆదివారం ఉదయం రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా కొత్త వైరస్ కేసులు కూడా రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి. రాష్ట్రంలో సెకండ్ వేవ్ లేదని, ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది.

Advertisement

Next Story

Most Viewed