తెలంగాణలో కొత్తగా 226 కరోనా కేసులు

by vinod kumar |
తెలంగాణలో కొత్తగా 226 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 226 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,621కి చేరింది. మరణాల సంఖ్య 1584 మందికి పెరిగింది. ప్ర‌స్తుతం 3,920 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న 224 మంది క‌రోనా నుంచి కోలుకోగా, ఇప్ప‌టి వ‌ర‌కు 2,87,117 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో 2,322 మంది ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed