నెల్లూరు జైల్లో 22 మందికి కరోనా

by  |
నెల్లూరు జైల్లో 22 మందికి కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదు అవుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా నెల్లూ జిల్లా కేంద్రంలోని జైల్లో కరోనా కలకలం రేపింది. ఒకేరోజు 22 మందకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
దీంతో వారం రోజుల్లోనే మొత్తం 72 మంది ఖైదీలకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడ్డ ఖైదీలను ప్రత్యేక గదుల్లో ఉంచి, చికిత్స అందిస్తున్నామని జైలుశాఖ అధికారులు అన్నారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.


Next Story

Most Viewed