దేశంలో కొత్తగా 18,177 కరోనా కేసులు..

by vinod kumar |
దేశంలో కొత్తగా 18,177 కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 18,177 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,23,965 చేరుకుంది. ఇందులో 2,47,220 యాక్టివ్ కేసులు ఉండగా.. 99,27,310 కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా వైరస్ బారినపడి 217 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1,49,435కి పెరిగింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.39 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 96.16 శాతానికి రికవరీ రేటు చేరిందంది.

Advertisement

Next Story

Most Viewed