తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు

by vinod kumar |
corona active cases in telangana district wise
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1280 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 21,137కి చేరాయి. కొత్తగా 15 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3484 కు పెరిగింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 165, కరీంనగర్‌లో 74, ఖమ్మంలో 156, మహబూబాబాద్ లో 52, మంచిర్యాల 70, మేడ్చల్‌మల్కాజ్‌గిరిలో 49, నల్గొండలో 80, పెద్దపల్లిలో 48, రంగారెడ్డిలో 76, సిద్దిపేటలో 46, సూర్యపేటలో 59, వరంగల్‌ అర్బన్‌లో 55 కేసులు నమోదయ్యాయి.

అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 04, జగిత్యాలలో 24, జనగాంలో 08, జయశంకర్ భూపాలపల్లిలో 16, జోగుళాంబ గద్వాలలో 14, కామారెడ్డిలో 01, కొమరంభీం ఆసిఫాబాద్ లో 05, మహబూబ్‌నగర్ లో 40, మంచిర్యాలలో 35, మెదక్ లో 5, ములుగులో 12, నాగర్‌కర్నూల్ లో 14, నారాయణపేట లో 05, నిర్మల్‌లో 04, నిజామాబాద్ లో 17, రాజన్నసిరిసిల్లాలో 14, సంగారెడ్డిలో 38, వికారాబాద్ లో 25, వనపర్తిలో 18, వరంగల్ రూరల్ లో 29, యాదాద్రి భువనగిరిలో 23 కేసులు నమోదయ్యాయి. శనివారం 2,15,240 మందికి వ్యాక్సిన్ అందిచారు. వీటిలో మొదటి డోసు వ్యాక్సిన్ ను 2,03,603 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 11,637 మందికి అందించారు. ఇప్పటి వరకు మొత్తం 63,17,019 మందికి, రెండవ డోసు వ్యాక్సిన్ ను 15,06,836 మందికి అందించారు.

Advertisement

Next Story

Most Viewed