దేశంలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు

by vinod kumar |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గాయి. సోమవారం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,00,636 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 2,427 మంది మరణించారు. అదే సమయంలో 1,74,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,49,186కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 14,01,609 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హో ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed