తెలుగు ప్రజల ఇంట ఆనంద దీపాలు వెలగాలి.. సీఎం వైఎస్ జగన్

by srinivas |
తెలుగు ప్రజల ఇంట ఆనంద దీపాలు వెలగాలి.. సీఎం వైఎస్ జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్విటర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ‘చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలాషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని’ సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.

Next Story

Most Viewed