‘వాళ్లను మీ ఇంట్లో దాచారా చంద్రబాబు’

by  |
‘వాళ్లను మీ ఇంట్లో దాచారా చంద్రబాబు’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల పోరు నడుస్తోంది. దీనిపై మరోసారి స్పందించిన విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చురకలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చంద్రబాబూ…. నేరుగా అడుగుతున్నా.. ఇంతకీ డాక్టర్ రమేష్‌ను మీ ఇంట్లో దాచారా? లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి?’ అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.


Next Story

Most Viewed