అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు ఏపీవాసులు మృతి

by Y.Nagarani |   ( Updated:2024-10-16 02:16:34.0  )
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు ఏపీవాసులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు మరణించారు. రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినవారిలో ముగ్గురు ఏపీవాసులున్నారు. వీరంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారుగా తెలుస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం 6.45 గంటలకు సౌత్ బాన్ హామ్ కు 6 మైళ్ల దూరంలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ప్రమాదంలో మరణించినవారిని శ్రీకాళహస్తికి చెందిన రాజినేని శివ, హరిత, తిరుమూరు గోపి గా గుర్తించారు. హరిత భర్త సాయి చెన్ను తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లినట్లు అక్కడి ప్రవాస భారతీయ ప్రతినిధులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed