భారీ వర్షాలు.. 75 కు చేరిన మృతుల సంఖ్య

by Disha Web Desk 12 |
భారీ వర్షాలు.. 75 కు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా.. బ్రెజిల్ లో భారీ వరదలు సంభవించాయి. దీంతో అనేక ప్రాంతాల్లో భవనాలు కొట్టుకుపోగా.. వేల సంఖ్యలో ఇల్లు నీటిలో మునిగాయి. దీంతో గడిచిన మూడు రోజుల్లో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 75 కి చేరింది. అలాగే ఈ భారీ వరదల వల్ల 88 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నీటి ఉధృతి తక్కువ కావడంలో రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరదల్లో ఇల్లు కోల్పోయిన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కాగా ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 103 మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాదాపు 16,000 మంది పాఠశాలలు, జిమ్‌లు, ఇతర తాత్కాలిక ఆశ్రయాల్లో ఆశ్రయం అందిస్తున్నారు.

Next Story

Most Viewed