చెన్నయ్‌ చిత్తు.. ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు

by Harish |
చెన్నయ్‌ చిత్తు.. ప్లే ఆఫ్స్‌కు బెంగళూరు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. నాకౌట్ రౌండ్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు అదరగొట్టింది. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్‌ సూపర్ కింగ్స్‌పై 27 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో చెన్నయ్‌తో కలిసి 14 పాయింట్లతో నిలిచిన బెంగళూరు మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్(54) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(47), రజత్ పటిదార్(41), గ్రీన్(38 నాటౌట్) సత్తాచాటారు. అనంతరం ఛేదనకు దిగిన చెన్నయ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులే చేసింది. రచిన్ రవీంద్ర(61) అర్ధ శతకం సత్తాచాటారు. ఆఖర్లో ఎం.ఎస్ ధోనీ(25)‌తో కలిసి రవీంద్ర జడేజా(42 నాటౌట్) చేసిన పోరాటం ఫలించలేదు. ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసిన యశ్ దయాల్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో చెన్నయ్ నాకౌట్ బెర్త్ కోల్పోవడంతోపాటు టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

Advertisement

Next Story

Most Viewed