చంపుతానంటూ మహిళకు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. అందుకేనా ?

by Anukaran |
చంపుతానంటూ మహిళకు వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. అందుకేనా ?
X

దిశ, ఏపీ బ్యూరో: తనను చంపుతానంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని ఓ మహిళా జెడ్పీటీసీ ఆరోపించారు. జెడ్పీవైస్ చైర్మన్ పదవి కోసం సదరు ఎమ్మెల్యే రూ. 5 కోట్లు తీసుకున్నాడని.. ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు దిగాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సదరు జెడ్పీటీసీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్లితే.. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తనను బెదిరిస్తున్నాడని చిత్తూరు జిల్లా ఐరాల జెడ్పీటీసీ సుచిత్ర లేఖలో ఆరోపించారు. జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఇప్పస్తానని మోసగించాడని, అందుకోసం లంచం కూడా తీసుకున్నాడని ఆమె లేఖలో ప్రస్తావించారు. పదవి ఇప్పించలేకపోవడంతో తిరిగి తన డబ్బులు తనకు ఇవ్వమని అడుగుతుంటే బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. నేను ఎమ్మెల్యేను..ఇచ్చేది లేదు నీకు దిక్కున్న చోట చెప్పుకో పో అంటూ తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆమె వాపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని జెడ్పీటీసీ సుచిత్ర లేఖలో కోరారు. అయితే ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గానీ…ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది గానీ స్పందించలేదు.

భీమ్లా నాయక్’ ఊర మాస్ లుక్… ఊగిపోతున్న పవన్ ఫ్యాన్స్

Next Story

Most Viewed