రమ్య నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఎట్టకేలకు వీడిన NRI మర్డర్ మిస్టరీ..

by Anukaran |
ramya
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణంలో మూడు రోజుల కిందట జరిగిన NRI హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు 72గంటల్లోనే మర్డర్ మిస్టరీని ఛేదించారు. వివరాల్లోకివెళితే.. విశాఖకు చెందిన సతీష్, రమ్య భార్యభర్తలు. అయితే, భర్త సతీష్ కు తెలియకుండా భాషా అనే వ్యక్తితో గత కొంతకాలంగా రమ్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే వీరి సాన్నిహిత్యానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య రమ్య ప్రియుడితో కలిసి సతీష్ మర్డర్‌కు స్కెచ్ గీసింది. బయటకు వెళ్లిన సతీష్‌ ఇంటికి తిరిగొచ్చే దారిలో పథకం ప్రకారం ఎదురుచూస్తున్న భాషా అతనిపై దాడి చేసి హత్య చేసాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అంతేకాకుండా ఆ హత్యానేరాన్ని సతీష్ స్నేహితుడిపై నెట్టివేసేందుకు పథకం రచించారు వీరిద్దరు. సతీష్ హత్య అనంతరం విచారణంలో భాగంగా రమ్యను పోలీసులు ప్రశ్నించారు. ఆమె చెప్పే సమాధానాలు పొంతన లేకపోవడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడి కావాలనే తన భర్తను హత్యచేయించినట్లు నేరం అంగీకరించింది. దీంతో ప్రియుడు భాషా, ప్రియురాలు రమ్యను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed