తల్లిదండ్రులు మృతి చిన్నారి ఏకాకి

by  |
తల్లిదండ్రులు మృతి చిన్నారి ఏకాకి
X

దిశ, వెబ్‌డెస్క్: ఎదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీ కొన్న ఘటనలో భార్యభర్తలు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందడం బాధాకరం. ఈ విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో వెలుగుచూసింది.

వివరాళ్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లెకు చెందిన శ్రీనివాస్ (40), తాడెం సమత(35) భార్యభర్తలు. అయితే, వరంగల్‌లో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొంతూరు నుంచి వరంగల్‌కు సోమవారం బయల్దేరారు.

అయితే, మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమత ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. కూతురు అశ్విత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని చిన్నారి పరిస్థితిపై బంధువలను సమాచారం ఇచ్చారు.


Next Story

Most Viewed