‘చేతబడి’తో వ్యక్తి అదృశ్యం.. పోలీసుల క్లారిటీ!

by Sumithra |
black-magic -1
X

దిశ, నర్సంపేట : రెండు రోజులుగా చేతబడి కారణంగా వ్యక్తి అదృశ్యం అంటూ చెలరేగిన పుకార్లకు వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. అలాంటిదేమి లేదని, అతని మానసిక పరిస్థితి బాగలేనందునే ఇంటినుండి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సతీష్ భార్య అనారోగ్యానికి గురైంది. ఈ ఘటనతో సతీష్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి సతీష్ తన ద్విచక్ర వాహనంపై బయలుదేరి డోర్నకల్ వెళ్ళాడు.

అక్కడ ఓ ప్రాంతంలో బైక్ వదిలేసి రైల్వేస్టేషన్ వెళ్లి ట్రైన్ ఎక్కి మహబూబాద్ వెళ్ళాడు. అక్కడ నుండి వరంగల్ వెళ్లే ట్రైన్ ఎక్కి వరంగల్ రైల్వే స్టేషన్లో దిగాడు. అతన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి తీసుకొచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సతీష్‌ను అతని సోదరుడైన కరుణాకర్‌కు అప్పగించారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మంత్రాలు, తంత్రాలు లాంటివి నమ్మకూడదని ఈ సందర్భంగా ఎస్సై శీలం రవి సూచించారు. రెండు రోజులుగా భయబ్రాంతులకు గురైన గ్రామస్తులకు చేతబడి ఓ కట్టు కథని తెలియడంతో వారిలో ఆందోళన ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed