- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: చేతులకు సంకెళ్లతో టీడీపీ విశాఖపట్టణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బీసీలు ఎస్సీలకు రాష్ట్రంలో స్థానం లేదని అన్నారు. బీసీలను హంతకుల మాదిరిగా చిత్రీకరించి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, యనమల తదితరులపై తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. ఇప్పుడు కొల్లు రవీంద్రపై కూడా తప్పుడు కేసులు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారన్నారు. మంచిపేరున్న టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ బురదజల్లే ప్రయత్నంలో ఉందని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకు 65 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని ఆయన మండిపడ్డారు.
Next Story