సిగ్గుపడాల్సింది పోయి హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తారా: విజయసాయిరెడ్డి

by  |
సిగ్గుపడాల్సింది పోయి హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తారా: విజయసాయిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర విమర్శలు చేశారు. వరుస ట్వీట్లలో ఆయన ఏమన్నారంటే… “తమ పార్టీ నేతలు వందల కోట్ల కుంభకోణాలు, ఫోర్జరీ, మోసం కేసుల్లో అరెస్టయితే సిగ్గు పడాల్సింది పోయి, మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు నాయుడు బాబు. స్వార్థ బుద్ధితో నేరాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న వారికి హక్కుల భంగం ఎలా కలిగిందో ప్రజలకు జవాబు చెప్పాలి” అన్నారు. మరో ట్వీట్‌లో “సమాంతర పాలన భ్రాంతిలో బాబు గారు మునిగి తేలుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కౌన్సిల్ లో అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారు. ఇలాంటి ఉపశమనాలతో బండి లాక్కొస్తున్నారు. వీడియోలు తీసి సభా మర్యాదలు ఉల్లంఘించిన కుమారుడు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు. ప్రజలు ఛీ కొడుతున్నా!” అంటూ విమర్శలు చేశారు.


Next Story

Most Viewed