ఒంగోలులో కంపించిన భూమి.. పరుగులు తీసిన ప్రజలు

by  |

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ఉదయం రెండు సెకెన్లపాటు భూమి కంపించింది. కాళ్ల కింద భూమి కదిలిపోతుండడంతో ఒంగోలు వాసులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గద్దల కుంట, దేవుడి చెరువు, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఇది తీవ్రమైనది కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీని తీవ్రత తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed