- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉప్పల..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎంపికయ్యారు. శుక్రవారం నోట్ఫైల్ను కూడా సీఎంఓ సిద్ధం చేసింది. త్వరలోనే పర్యాటకం, సాంస్కృతిక శాఖ అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనుంది. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఆర్య వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఉప్పల్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చాలా రోజులుగా పేద కుటుంబాల్లో పెళ్లిళ్లకు పుస్తె మెట్టలు దానం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచారు. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. తొలుత శ్రీనివాస్ ఎమ్మెల్సీని ఆశించగా, ప్రభుత్వం మాత్రం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపిక చేసింది. ఎమ్మెల్సీగా ఎంపికైనా బుగ్గారపు దయానంద్ కూడా వైద్య సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల శ్రీనివాస్ను కార్పొరేషన్కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.