కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌కు కరోనా

by  |
కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌కు కరోనా
X

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. కేంద్ర నీటి వనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్‌ ఇటీవలే ‘భాభీ జీ పాపడ్’ కరోనా నుంచి రక్షిస్తుందని తెలిపి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అర్జున్ మేఘవాల్ కరోనా సోకిన నాలుగో కేంద్రమంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్రప్రదాన్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed