పుల్వామాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

by Shamantha N |   ( Updated:2021-07-31 03:20:23.0  )
పుల్వామాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్ పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో గుర్తు తెలియని ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్టు కాశ్మీర్ జోన్ పోలీసులు శనివారం ట్వీట్ చేశారు. నాగ్ బరేన్ తర్సాన్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ పోలీసులు, కేంద్ర భద్రతాబలగాలకు చెందిన జవాన్లు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed