విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం

by srinivas |
విజయనగరం జిల్లాలో ఘోర ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గరుగుబిల్లి మండలం రావివలస దగ్గర వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి రెండు బైక్‌లను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో రెండు బైక్‌లు దగ్ధం అయ్యాయి. మృతుల స్వస్థలం రావివలసగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed