టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. అతడికి కోర్టు సమన్లు

by Sumithra |
tollywood drugs case
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో కెల్విన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 11న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. డ్రగ్స్ కేసులో కెల్విన్‌ను 2016లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెల్విన్‌పై అభియోగపత్రాన్ని నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. అటు ఈ కేసులో సినీ నటుడు నందు ఈడీ విచారణ ఇవాళ పూర్తయింది. దాదాపు 8 గంటల పాటు నందు విచారణ కొనసాగింది. కెల్విన్ సమక్షంలో నందును విచారించారు.

Advertisement

Next Story

Most Viewed