- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Viral: మంటలతో అర కిలోమీటర్ మేర ప్రయాణించిన కారు.. భయంతో పరుగులు తీసిన జనం
దిశ, డైనమిక్ బ్యూరో: మంటల్లో కాలిపోతున్న కారు రోడ్డుపై అరకిలోమీటర్ మేర ప్రయాణించడంతో జనం భయందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటన ప్రకారం జితేందర్ అనే వ్యక్తి అజ్మీర్ రోడ్డులోని ఎలివేటెడ్ కారిడార్ పై కారులో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా కారు ఏసీ నుంచి పొగలు రావడం గమణించిన అతడు రోడ్డు పక్కన నిలిపివేసి, బానెట్ తెరిచి చూశాడు. అప్పటికే ఇంజిన్ లో మంటలు రావడంతో కారు నుంచి దూరంగా వెళ్లిపోయాడు. అనంతరం కారు హ్యాండ్ బ్రేక్ డ్యామేజీ అవ్వడంతో రోడ్డుపై పరుగులు తీయడం ప్రారంభించింది. దీంతో స్థానిక ప్రజలు మంటలతో వస్తున్న కారును చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, భయంతో పరుగులు తీశారు. కారు దాదాపు అరకిలోమీటర్ మేర ప్రయాణించి డివైడర్ ను ఢీ కొట్టి ఆగిపోయింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దీనిని కొందరు వ్యక్తులు చిత్రీకరించి పోస్ట్ చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని చెప్పారు.