Trending: బాలికపై అత్యాచారయత్నం.. వ్యక్తికి దేహశుద్ధి చేసిన జనం (వీడియో)

by Shiva |   ( Updated:2024-09-02 03:53:20.0  )
Trending: బాలికపై అత్యాచారయత్నం.. వ్యక్తికి దేహశుద్ధి చేసిన జనం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమాయకులైన బాలికలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అవుకు మండల పరిధిలోని కాశిపురం గ్రామంలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థినిపై దాసయ్య అనే వ్యక్తి కన్నేశాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటిరిగా ఉన్న బాలికపై అతడు అత్యాచారయత్నం చేయగా బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి దాసయ్యను రెడ్‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. అనంతరం ఇనుప స్తంభానికి కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/TeluguScribe/status/1830446970839670804

Advertisement

Next Story

Most Viewed