- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మండుటెండలో కొత్త కపుల్ జర్నీ.. MLA చేసిన పనికి నెటిజన్లు ఫిదా (వీడియో)
దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కొత్త జంట మండుటెండలో బైక్పై వెళ్తున్నారు. మండుటెండలో అలా ఆ జంట బైక్పై వెళ్లడం చూసిన ఓ ఎమ్మెల్యే చలించిపోయారు. ఆ జంటను తన కారులో ఎక్కించుకుని వారి ఇంటి దగ్గర దింపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జయవర్ధన్ సింగ్ తండ్రి దిగ్విజయ్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ తండ్రి కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ ప్రచారం ముగించుకుని తన కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో మండుటెండలో బైక్ పైన వెళ్తున్న ఓ కొత్త జంటను ఎమ్మెల్యే చూశారు. వెంటనే ఎమ్మెల్యే తన కారును ఆపి, ఆ జంటను తన కారులో కూర్చోవాల్సిందిగా కోరారు.
అలానే వధువును తన సోదరిగా భావించి ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిందిగా వరుడుని కోరారు. ఎమ్మెల్యే ముందు సీట్లో కూర్చోగా ఆ జంట కారు వెనక సీట్లో కూర్చున్నారు. కాగా నూతన వధూవరుల ఇంటి దగ్గరకు చేరుకున్న తరువాత, స్వయంగా ఎమ్మెల్యేనే ఆ కారు డోరు తీసి ఆ కొత్త జంటకు స్వాగతం పలికారు.
అయితే గుడికి వెళ్లిన కొత్తజంట ఫార్చ్యూనర్ కారులో నుండి దిగడం చూసిన వారి కుటుంబ సభ్యుల ఆశ్చర్యపోయారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఎమ్మెల్యేపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి.