ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి 

by  |
ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ మృతి 
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండలం మాచినేనిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పంట పొలాల్లో ఆదివారం సేద్యం చేస్తూ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే… మాచినేనిపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే రైతు.. పొలం బ్లేడుతో ట్రాక్టర్ సేద్యం చేయిస్తుండగా… ట్రాక్టర్ బోల్తా పడడంతో డ్రైవర్ పుల్లయ్య(49) అక్కడికక్కడే మృతిచెందాడు.

పుల్లయ్య కుటుంబం బేతంచెర్ల మండలం గొర్లగుంత గ్రామం నుండి మూడేళ్ల క్రితం మాచినేనిపల్లికి వలస వచ్చారు. గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే రైతుకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న రుద్రవరం ఎస్సై రామ్మోహన్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed