దేశంలో ఘోరంగా కరోనా విజృంభణ

by  |
Covid cases
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడంలేదు. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,472 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,021 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 34 లక్షల 63,973కి చేరింది. ఇందులో 26, 48,999 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 7 లక్షల 52,424 మంది బాధితులు కరోనాతో ఇంకా పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62,550 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.


Next Story

Most Viewed