రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు దుర్మరణం

by  |
రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అతివేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే రంపచోడవరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాల్వంచ వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed