పుట్టి మునక.. ముగ్గురు గల్లంతు

by Anukaran |
పుట్టి మునక.. ముగ్గురు గల్లంతు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పుట్టి మునిగి ముగ్గురు గల్లంతు అయిన ఘటన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామం శ్రీ దత్త వల్లభాపురం సమీపంలోని కృష్ణా నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

దత్తాత్రేయ దేవాలయం దగ్గర నాటు పడవలో సుమారు 15మంది ప్రయాణికులు కర్ణాటక వైపు ఉన్న కురువపురం వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతు అవ్వగా మిగతా వారు కర్ణాటక లోని కురువపురంకు చేరుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న అధికారులు గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story