నిర్విరామంగా 12 గంటలు గంట కొట్టిండు..

by  |
నిర్విరామంగా 12 గంటలు గంట కొట్టిండు..
X

దిశ, జగిత్యాల: కరోనా వ్యాక్సిన్ త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని పట్టణంలో శ్రీ భగవాన్ ధన్వంతరి దేవాలయం‌లో నిర్విరామంగా 12 గంటల పాటు ఓ భక్తుడి ఘంటానాదం చేశారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన గంగిశెట్టి రాజేశం అనే భక్తుడు కరోనా వ్యాక్సిన్ త్వరగా రావాలని ఈ ప్రయత్నం చేశారు.

ప్రజలు మహమ్మారి నుంచి త్వరగా బయట పడాలనే సంకల్పంతో, వైద్యానికి ప్రత్యక్ష దైవమైన ధన్వంతరి స్వామి దేవాలయంలో ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 12 గంటల పాటు నిర్విరామంగా ఘంటానాదంను మోగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యలు రాజేశం కుటుంబ సభ్యులను సత్కరించి, వారి సంకల్పం నెరవేరాలని ఆశీర్వదించారు.


Next Story

Most Viewed