- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
by Sumithra |
X
దిశ, చేవెళ్ల : వరి పొలంలో ట్రాక్టర్ దున్నుతుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శంకరపల్లి మండలం కచ్చి రెడ్డి గూడ గ్రామానికి చెందిన మాల భిక్షపతి (35) అద్దె పద్ధతిలో పర్వేద గ్రామానికి చెందిన బేగరి బుచ్చయ్య వరి పొలంలో కచ్చిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన మాల భిక్షపతి తన ట్రాక్టర్ తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది.
ఈ సంఘటనలో అతనిపై ట్రాక్టర్ పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే గల పొలం రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శంకర్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సంఘటనపై ఆరా తీశారు. మృతుడి భార్య మహేశ్వరి మాసానిగూడ వార్డ్ మెంబర్ గా పని చేస్తున్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Advertisement
Next Story