తెలంగాణ సచివాలయంలో తొలి కరోనా మరణం

by vinod kumar |
Assistant Secretary Dudam Venkata Narsinha Raju
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సచివాలయంలో తొలి కోవిడ్ మరణం సంభవిచింది. ఇటీవల కరోనా బారినపడిన అసిస్టెంట్ సెక్రటరీ దూడం వెంకట నర్సింహా రాజు(55) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా, తెలంగాణ సచివాలయంలో ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా బారినపడగా కొందరు ఇప్పటికే కోలుకున్నారు. మరికొందరు హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. నర్సింహా మరణం సచివాలయంలో తొలి మరణం కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed