పుల్వామాలో మొదలైన ఎదురుకాల్పులు

by  |
పుల్వామాలో మొదలైన ఎదురుకాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల రెచ్చిపోయారు. మంగళవారం ఉదయం మార్వాల్ ఏరియాలో భద్రతా దళాలకు ఎదురుపడ్డ టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ వారి పై ఎదురు కాల్పులు ప్రారంభించారు. కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లోయలో ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్టు పక్కా సమాచారంతో.. భారత సైన్యం, పోలీసులు సంయుక్త బృందం సెర్చ్ ఆపరేషన్ చేసే సమయంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దీని పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed