తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దేశంలోనే ఎయిమ్స్‌కు ప్రత్యేక గుర్తింపు

by Shyam |
Bibinagar AIIMS
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్‌కు మరో ప్రతిష్టాత్మక డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిష్టాత్మక డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్‌తో పాటు జన్యు పరమైన రోగ నిర్ధారణకు పరీక్షించే డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో దేశంలోనే ఈ సేవలు అందుబాటులో ఉన్న ఏకైక ఎయిమ్స్‌గా బీబీనగర్ ఎయిమ్స్ గుర్తింపు పొందనుంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా జన్యుపరమైన వ్యాధులను ప్రారంభ దశలోనే కనుగొనడానికి సహాయపడనుంది.

Advertisement

Next Story

Most Viewed