గచ్చిబౌలిలో కారు బీభత్సం.. అక్కడికక్కడే మహిళ మృతి

by Javid Pasha |
గచ్చిబౌలిలో కారు బీభత్సం.. అక్కడికక్కడే మహిళ మృతి
X

దిశ, శేరిలింగంపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్రో సర్కిల్ నుండి త్రిబుల్ ఐటీ వెళ్లే మార్గంలో అతివేగంగా వచ్చిన (ఏపీ 28 సీఎల్ 1134) కారు రోడ్డు పక్కన పని చేస్తున్న మహిళ మల్లీశ్వరి (38)ను అతివేగంతో ఢీ కొట్టడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మద్యం సేవించి పూర్తి నిర్లక్ష్యంగా కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. అలాగే కారులో ఉన్న మరో వ్యక్తి సైతం ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.



Advertisement

Next Story