- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Tamannaah Bhatia: డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న తమన్నా క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia) వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్లో ఉంది. అలాగే ఐటమ్స్ సాంగ్స్లోనూ అదిరిపోయే స్టెప్పులేసి సినీ ప్రియులను అలరిస్తోంది. ఇటీవల తమన్నా ‘స్త్రీ-2’(Stree -2 ) మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటు పలు రికార్డులు సాధించింది. ఇదిలా ఉంటే.. తమన్నా సినిమాలతో పాటు వెబ్సిరీస్లు కూడా చేస్తూ ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. ప్రజెంట్ ఈ అమ్మడు ‘సికందర్ కా ముకద్దర్’(Sikandar ka Muqaddar) అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే దీనికి నీరజ్ పాండే(Neeraj Pandey) దర్శకత్వం వహిస్తుండగా.. జిమ్మీ షెర్గిల్, అవినాష్ తివారీ(Avinash Tiwari) ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. దీనికి ‘‘60 కోట్ల విలువైన వజ్రం చోరీ. ఓ సుదీర్ఘమైన వెతుకులాట. ఓటమిని అంగీకరించని ఓ ఇన్స్పెక్టర్. సికందర్ కా ముకద్దర్ త్వరలోనే నెట్ఫ్లిక్స్లోకి రానుంది’’ అనే క్యాప్షన్ జత చేసి నెట్ఫ్లిక్స్(Netflix) మేకింగ్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం స్ట్రీమింగ్ తేదీ త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.