అమ్మా ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నా..ఇక నాకు ఆ మెసేజ్ రాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టార్ హీరో పోస్ట్

by Kavitha |   ( Updated:2024-10-21 09:09:40.0  )
అమ్మా ఈ పెయిన్ తట్టుకోలేకపోతున్నా..ఇక నాకు ఆ మెసేజ్ రాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టార్ హీరో పోస్ట్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో హీరోగా నాని నటించిన ‘ఈగ’ సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిచ్చ సుదీప్ మాతృమూర్తి సరోజ సంజీవ్ నిన్న కన్నుమూశారు. ఇక తల్లి మరణాన్ని తట్టుకోలేక నేడు సుధీప్ బాధతో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

తాజాగా కిచ్చసుదీప్ స్ వేదికగా ఓపోస్ట్ పెట్టారు. అందులో తన తల్లితో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. “ఇన్ని రోజులు మనిషి రూపంలో నా పక్కన తిరిగిన దేవత మా అమ్మ. ఆమె నా గురువు. నా మొదటి అభిమాని. నేను ఎలా నటించినా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఓ అందమైన జ్ఞాపకం మాత్రమే. 24 గంటల్లో అంతా మారిపోయింది. నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఆమె లేదనే విషయాన్ని నేనింకా అంగీకరించలేక పోతున్నా. ఇకపై నాకు ‘గుడ్ మార్నింగ్ కన్నా’ అనే మెసేజ్ రాదు. శుక్రవారం చివరిసారి మెసేజ్ పెట్టింది. శనివారం బిగ్‌బాస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. డాక్టర్లతో మాట్లాడి షో వేదికపైకి వెళ్లాను. మనసులో బాధ ఉన్నా షూటింగ్ చేశా. షూటింగ్ అయిపోయాక ఆసుపత్రికి వెళ్లేసరికి ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమె సృహలో ఉన్నప్పుడు చూడలేకపోయాను. ఆదివారం ఉదయం ఆమె శాశ్వతంగా దూరమైంది. చూస్తుండగానే కొన్ని గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన మా అమ్మ.. కొన్ని గంటల్లోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది" అని కిచ్చా సుదీప్ తన బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

(video link credits to kicha sudeep X account)

Advertisement

Next Story