ఇప్పటికీ ఆ విషయంలో సమంత పెట్టిన రూల్‌నే పాటిస్తున్న అక్కినేని ఫ్యామిలీ..!

by Hamsa |   ( Updated:2024-10-16 15:30:00.0  )
ఇప్పటికీ ఆ విషయంలో సమంత పెట్టిన రూల్‌నే పాటిస్తున్న అక్కినేని ఫ్యామిలీ..!
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya), టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేశావే’ సినిమాలో జంటగా నటించి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. కొద్ది కాలం తర్వాత వీరిద్దరు ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. కానీ డైవర్స్‌కు అసలు కారణం ఏంటో మాత్రం వెల్లడించలేదు. అయితే వీరి విడాకులపై నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఇటీవల వీరిద్దరి విడాకుల గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha)చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టాలీవుడ్ సినీ సెలబ్రిటీలంతా రియాక్ట్ అయ్యారు. అలాగే చట్టపరంగా వెళ్లిన నాగార్జున(Nagarjuna), కొండా సురేఖపై ఏకంగా రూ.100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. దీనిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే వస్తోంది. ఇప్పటికీ దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సమంత చాలా పర్ఫెక్ట్ డైట్ ఫాలో అయ్యేదట. అయితే పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లినప్పుడు వారి డైట్‌ను పూర్తిగా ఆమె మార్చేసిందని తెలుస్తోంది.

ఏ రోజు ఏ ఫుడ్ తినాలో సెపరేట్‌గా ఓ టైమ్ టేబుల్ క్రియేట్ చేసిందట. మరీ ముఖ్యంగా సాయంత్రం సమయంలో 6 గంటల లోపు డిన్నర్ ఫినిష్ చేసి కచ్చితంగా వాక్ చేయాలని రూల్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సమంత(Samantha), చైతుతో విడాకులు తీసుకుని వెళ్లి పోయినప్పటికీ అక్కినేని ఫ్యామిలీ మాత్రం అదే రూల్ పాటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉంది అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసి సమంత అభిమానులు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story