మైకం మత్తులో దారుణం.. బైక్‌ను ఢీ కొట్టిన కారు

by Javid Pasha |   ( Updated:2022-03-19 14:00:51.0  )
మైకం మత్తులో దారుణం.. బైక్‌ను ఢీ కొట్టిన కారు
X

దిశ, మియాపూర్: మితి మీరిన వేగం ఆ పై మద్యం మత్తులో కారు నడిపి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అందులో ఒకరు మామూలు గాయాలతో ఇంకొకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యస్ఐ లింగ్యా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లో రెడ్డి కాలనీలో నివాసం ఉండే నిఖిల్ రెడ్డి , ప్రకాష్ రెడ్డిలు మియాపూర్ నుంచి 18 వ తేదీ రాత్రి 11.30 సమయంలో ( టీ యస్ 06 ఎఫ్ 6581 ) బైక్‌పై ఇంటికి వెళుతున్నారు. ఈ క్రమంలో జేపీ నగర్ నుంచి కొండాపూర్ వైపుకు వస్తున్న కళ్యాణ్ సింగ్ కారు ( ఏపీ 09 బీ హెచ్ 2019) విశ్వనాథ్ గార్డెన్ వద్ద బైక్‌ను ఢీ కొట్టారు.

అతివేగం ఆపై మద్యం మత్తులో బైక్‌ను ఢీ కొట్టారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు కింద పడ్డారు. బైక్ నడుపుతున్న వ్యక్తి తలకి తీవ్ర గాయం కాగా వెనకున్న వ్యక్తి కాలు విరిగింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి మితిమీరిన మద్యం సేవించి కారు నడిపినట్లు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన సదరు కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed