ప్రజాశాంతి పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన కేఏ పాల్

by GSrikanth |
ప్రజాశాంతి పార్టీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన కేఏ పాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. సోమవారం అమీర్ పేటలోని ప్రజాశాంతి కార్యాలయంలో 12 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది టికెట్ కావాలని అప్లికేషన్ పెట్టుకున్నారని తెలిపారు. రెండో లిస్ట్ కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అధికార దాహంతో తనను ఇబ్బంది పెడుతున్నారని, తాను అందరికీ సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు.

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను నమ్ముకొని మునిగిపోయాము.. అని తన దగ్గరకు వచ్చి నేతలు ఏడ్చారని చెప్పారు. షర్మిలది అసలు పార్టీనే కాదన్నారు. నేను షర్మిల లాగా ప్యాకేజీ స్టార్ కాదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి, షర్మిల రెడ్డి, కోదండరాం రెడ్డి మద్దతు ఇస్తారని ముందే చెప్పానని తెలిపారు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తనకు కాల్ చేశారని తెలిపారు. తెలంగాణలో ఉన్న పార్టీలు అన్ని అవినీతితో ఉన్నాయి.. నేను ఒక్కడినే క్లీన్ చిట్ నాయకుడిని.. కాబట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజలు నన్ను గెలిపించండి.. అంటూ కేఏపాల్ పిలుపునిచ్చారు.

ప్రజాశాంతి పార్టీ ఫస్ట్ లిస్ట్ ఇదే:

చెన్నూరు - మొయ్య రాంబాబు

జుక్కల్‌- కర్రోల్ల మోహన్‌

రామగుండం- బంగారు కనకరాజు

వేములవాడ- అజ్మీరా రమేశ్‌బాబు

నర్సాపురం - సిరిపురం బాబు

జహీరాబాద్‌ - బేగరి దశరథ్‌

గజ్వేల్‌ - పాండు

ఉప్పల్‌ - కందూరు అనిల్‌ కుమార్‌

యాకుత్పురా - సిల్లివేరు నరేశ్‌

కల్వకుర్తి - కట్టా జంగయ్య

నకిరేకల్‌ - కదిర కిరణ్‌కుమార్‌

మధిర - కొప్పుల శ్రీనివాస్‌ రావు



Next Story