మల్లన్న ఆచూకీ ఎక్కడ...? ఎక్కడున్నాడో చెప్పాలని భార్య మమత డిమాండ్

by Rajesh |
మల్లన్న ఆచూకీ ఎక్కడ...? ఎక్కడున్నాడో చెప్పాలని భార్య మమత డిమాండ్
X

దిశ, మేడిపల్లి : తన భర్త ఆచూకీ తెలపాలని తీన్మార్ మల్లన్న సతీమణి మమత మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, లాయర్లతో కలిసి మేడిపల్లి ఇన్ స్పెక్టర్‌ను మమత కలిశారు. తన భర్తను ఎందుకు ఆరెస్ట్ చేశారని, ఏ పోలీస్ స్టేషన్‌లో పెట్టారని, తన భర్త ఆరెస్టుకు ముందు నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని ఎందుకు ఇవ్వడం లేదని మమత ప్రశ్నించారు. మల్లన్న ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, పోలీసులు అసలు అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న సమాచారం కూడా ఇవ్వలేదని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో పోలీసులు ఆమెను తన భర్తతో మాట్లాడిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. మహిళా పోలీసులతో ఆమె భర్త దగ్గరికి మాట్లాడిస్తామని తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే తీన్మార్ మల్లన్న అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు ఒకసారి, అదిభట్ల ఠాణాలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారని తీన్మార్ మల్లన్న అభిమానులు ఫైర్ అవుతున్నారు. పోలీసులు మాత్రం మల్లన్న ఆచూకీ తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఇదిలా ఉండగా.. మల్లన్న అరెస్టు విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలివస్తున్నారు. ఆయన ఆచూకీ చెప్పకపోతే ప్రభుత్వం, పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Next Story