- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాతబస్తీ అభివృద్దికి కృషి చేస్తాం : మంత్రి శ్రీధర్బాబు

దిశ, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వంలో మన ఊరు మన బడి పథకంలో పెద్ద కుంభకోణం జరిగిందని, అది కాళేశ్వరం కంటే పెద్దగా ఉందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ఓవైసీ పేర్కొన్నారు. మన ఊరు మన బడిలో ఎక్కడ పనులు జరగలేదని, జరిగిన వాటికి నిధులు విడుదల చేయలేదని, విద్యార్థులకు సరఫరా చేసే బెంచీల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఈ కుంభకోణంపై ప్రశ్న వేద్దామని అనుకుంటే ప్రశ్నోత్తరాలు రద్దు చేశారని పేర్కొన్నారు. రూ. 14 వేల నుంచి రూ. 18 వేల వరకు కొన్నారని, మార్కెట్లో రూ. 5 వేలకు ఒక బెంచ్వస్తుందని అంత మొత్తం పెట్టి ఎందుకు కొనుగోళు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈస్కామ్పై ప్రభుత్వం విచారణ చేయించాలని, తాను ప్రస్తుతం వారి పేర్లు చెప్పలేననని, కాళేశ్వరానికి మించి స్కామ్జరిగి నిధులు పక్కదారి పట్టాయన్నారు. 32 లక్షల బెంచీలు కొనుగోలు చేసి, దానికి సంబంధించిన నాయకుడు అప్పడు బీఆర్ఎస్లో ఉన్నారని ఇప్పడు అదికార పార్టీలో ఉండి తన అవినీతి బయట పడకుండా కాపాడుకున్నాడని ఆరోపించారు. అదే విధంగా రేవంత్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత పాతబస్తీలో ఉన్న హైకోర్టు, సెట్విన్కేంద్రాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా రోడ్డు నిర్మాణాలు సరిగా లేవని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అక్కడ ప్రజలకు సక్రమంగా అందడం లేదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ఆర్కు లాంటి లీడర్లేడు : ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత వైఎస్. రాజశేఖర్రెడ్డి లాంటి డైనమిక్లీడర్ ఎవరు లేరన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆయనకు మించిన నాయకుడు కనిపించడంలేదన్నారు. ఆయనను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకొని పాలన చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ది అవుతుందని సూచించారు. పాతబస్తీ అభివృద్దిలో వైఎస్ఆర్పాత్ర మరువలేనిదని, ఇప్పటికి అక్కడ ప్రజలు ఆయనను గుర్తు చేశారని తెలిపారు.
తెలంగాణలో ఓల్డ్సీటీ ఒరిజినల్సిటీ : మంత్రి శ్రీధర్బాబు
పాతబస్తీ అభివృద్దిపై గత పాలకులు నిర్లక్ష్యం చేశారని తాము ఓల్డ్సిటీని ఒరిజినల్ సిటీ బావిస్తున్నామని, అక్కడ ఉన్న హెరిటెడ్కట్టడాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అక్బరుద్దీన్ప్రశ్నకు మంత్రి శ్రీధర్బాబు సమాధానమిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారుల నిర్మాణాలు చేపడుతామని, మౌలిక వసతుల కల్పనకు త్వరలో చర్యలు చేపడుతామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేసేందుకు ప్లాన్చేస్తున్నామని తెలిపారు.